- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: మహారాష్ట్రలోని డోంబివల్లిలోని కేడీఎంసీ (KDMC) శాస్త్రీనగర్ ఆసుపత్రిలో శివసేన కార్పొరేటర్ రమేష్ మాత్రే ఒక మహిళా వైద్యురాలితో పాటు అక్కడ ఉన్న వైద్య సిబ్బందిపై దాడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఈ దాడికి నిరసనగా ఆసుపత్రి వైద్యులు, నర్సులు విధులు బహిష్కరించి ‘కామ్ బంద్’ ఆందోళన చేపట్టగా, తీవ్ర ఒత్తిడి నడుమ విష్ణునగర్ పోలీసులు కార్పొరేటర్ రమేష్ మాత్రేతో పాటు మరో నలుగురిపై ఐపీఎస్, మెడికల్ సర్వీస్ పర్సన్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు..
- Advertisement -



