Wednesday, July 22, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఈ రాత్రికి ఇరాన్‌పై విరుచుకుపడతాం: ట్రంప్‌

ఈ రాత్రికి ఇరాన్‌పై విరుచుకుపడతాం: ట్రంప్‌

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: ఈరోజు రాత్రి ఇరాన్‌పై మరింత తీవ్రంగా దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు. తుర్కియేలో జరుగుతున్న నాటో సదస్సులో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘‘నేను ఒక చిన్న హెచ్చరిక చేస్తున్నా. ఈ రాత్రి ఇరాన్‌పై గట్టిగా విరుచుకుపడబోతున్నాం’’ అని ట్రంప్ పేర్కొన్నారు. హర్మూజ్‌ జలసంధిలో ప్రయాణిస్తోన్న మూడు నౌకలపై ఇరాన్ దాడులు చేసిన సంగతి తెలిసిందే. అందుకు ప్రతిగా ఇరాన్‌  వైమానిక రక్షణ వ్యవస్థలు, తీరప్రాంత నిఘా వ్యవస్థలపై అమెరికా ఇప్పటికే వైమానిక దాడులు చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -