- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ :భారత్తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక ఆటగాడు దినేశ్ చందిమల్ గాయపడ్డాడు. మంగళవారం అంతర్జాతీయ స్టేడియంలో టీమిండియా రెండో ఇన్నింగ్స్ సమయంలో ఫీల్డింగ్ చేస్తూ బౌండరీని ఆపే ప్రయత్నంలో చందిమల్ కుడి భుజానికి, మెడకు గాయమైంది. ఫిజియోథెరపిస్ట్ పరీక్షించిన తర్వాత, ముందు జాగ్రత్తగా అతడిని స్కానింగ్ కోసం ఆసుపత్రికి తరలించారు. స్కానింగ్ ఫలితాలు వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు తెలియజేస్తామని శ్రీలంక క్రికెట్ బోర్డు తెలిపింది.
- Advertisement -



