- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో మార్చి నెల నుంచే ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి. ఉదయం నుంచే వీస్తున్న వేడిగాలుల వల్ల ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెల్సియస్ దాటుతున్నాయి. రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత తీవ్రతరం అవుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
- Advertisement -



