Saturday, March 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళల ఉపాధి కోసం కుట్టు మిషన్ ట్రైనింగ్ క్లాస్ ప్రారంభం

మహిళల ఉపాధి కోసం కుట్టు మిషన్ ట్రైనింగ్ క్లాస్ ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం శర్బనాపురం గ్రామంలో ఆరుట్ల కమలాదేవి రామచంద్రరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ తరగతులను శుక్రవారం ఆరుట్ల సుశీలాదేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ కుట్టు మిషన్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.

మహిళలు కుట్టు మిషన్ నేర్చుకోవడం ద్వారా స్వయం ఉపాధి సాధించడంతో పాటు కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చని అన్నారు.మార్కెట్లో లభించే రెడీమేడ్ దుస్తులపై ఆధారపడకుండా,నాణ్యమైన బట్టలను తయారు చేసి ప్రజలకు అందించడం ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఆరుట్ల కమలాదేవి, రామచంద్రరెడ్డి చేసిన సేవలను స్మరించుకున్నారు. పేద ప్రజల కోసం “దున్నేవాడికే భూమి కావాలి”, వెట్టి చాకిరి నిర్మూలన కోసం భుజాన తుపాకి వేసుకొని ప్రజలను చైతన్య పరిచిన వారి పోరాట స్ఫూర్తిని గుర్తు చేశారు.వారి త్యాగాలు నాటి ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేష్, గ్రామ సర్పంచ్ మొగలగాని నర్సయ్య,ఉపసర్పంచ్ సైదాపురం మౌనిక సురేష్, వార్డు సభ్యులు కందుల మధు, సిరిగిరి నవీన్, కారే రాజు, కందుల వినోద్, వీవీకే మొగలగని యమున, మహిళా సంఘం అధ్యక్షురాలు కందుల కౌసల్యతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -