- Advertisement -
నవతెలంగాణ – చిన్నకోడూరు
మండల పరిధిలోని అల్లిపూర్ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో కుమ్మరి నరసయ్య, వైనాల భూమవ్వ లు మృతి చెందారు. శుక్రవారం సర్పంచ్ కుంభాల మణెవ్వలాలయ్య ద్వారా విషయం తెలుసుకొని మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5000 చొప్పున ఎన్ఆర్ఐ వంగ రాజేశ్వర్ రెడ్డి ఆర్థిక సహయం అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు శానకొండ రాజు, దార శోభ, బోయిని శిల్ప, కప్పెర రోజా, కొత్తకొండ మూర్తి, అక్కి తిరుపతి, కుంభాల శేఖర్, విజయేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



