- Advertisement -
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలను కలుపుతూ నాగర్కోయిల్ నుంచి చెర్లపల్లికి స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లతో కూడిన కొత్త అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు త్వరలో ప్రారంభిం చనున్నారు. ఇది దూర ప్రాంత ప్రయాణీకులకు సౌకర్యవం తమైన ప్రయాణం చేయడానికి ఎంతో ప్రయోజనం చేకూర్చనుంది. ఇతర పూర్తి వివరాలను త్వరలో తెలియజేస్తామని దక్షిణ మధ్య రైల్వే శనివారం ఒక ప్రకటనలో తెలియజేసింది.
- Advertisement -



