Monday, March 9, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంపశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత.. స్వదేశానికి 52 వేల మంది భారతీయులు

పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత.. స్వదేశానికి 52 వేల మంది భారతీయులు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: పశ్చిమాసియాలో తీవ్ర అనిశ్చితి కొనసాగుతోంది. అమెరికా-ఇజ్రాయెల్‌, ఇరాన్‌లు పరస్పరం భీకర దాడులు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో గల్ఫ్‌ దేశాల నుంచి 52,000 మంది భారత పౌరులు స్వదేశానికి చేరుకున్నారు. ఆ ప్రాంతమంతటా పాక్షికంగా విమానాల రాకపోకలకు అనుమతులు ఇవ్వడంతో వారు ఇండియాకు చేరుకున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పశ్చిమాసియాలో చిక్కుకున్న పౌరులు స్థానిక అధికారుల మార్గదర్శకాలను, భారత మిషన్లు జారీ చేసే అడ్వైజరీలను పాటించాలని సూచించింది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -