- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఇజ్రాయెల్-అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర భారీగా పెరిగింది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు $100 దాటి, ప్రస్తుతం $101.19 వద్ద ట్రేడ్ అవుతోంది. గత 4 ఏళ్లలో తొలిసారిగా ధర $100 దాటిందని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. దీని ప్రభావంతో చమురును దిగుమతి చేసుకునే దేశాల్లో పెట్రోల్, డీజిల్, LPG, కిరోసిన్ ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. చివరగా 2022 జూన్లో బ్యారెల్ క్రూడాయిల్ ధర $100 దాటింది.
- Advertisement -



