- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : టి20 వరల్డ్ కప్ గెలిచిన టీమ్ఇండియాను ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ, సచిన్, కోహ్లీ అభినందించారు. ‘ఈ విజయం అసాధారణ నైపుణ్యాలు, దృఢ సంకల్పం, జట్టు కృషిని ప్రతిబింబిస్తుంది. ప్రతి భారతీయుడి హృదయం గర్వం, ఆనందంతో నిండిపోయింది’ అని మోడీ ట్వీట్ చేశారు. భారత్ స్పెషల్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడిందని సచిన్ ప్రశంసించారు. ‘టోర్నీలో భారత్ ఆటకు సాటిలేదు. క్లిష్ట పరిస్థితుల్లోనూ అద్భుతంగా పోరాడారు’ అని కోహ్లీ పేర్కొన్నారు.
- Advertisement -



