- Advertisement -
నవతెలంగాణ-బీర్కూర్ (నసురుల్లాబాద్)
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎంపీవో మహిబూబ్, సర్పంచ్ అరిగే ధర్మతేజ అన్నారు. సోమవారం బీర్కూర్ గ్రామాల్లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా పల్లె ప్రకృతివనం వద్ద ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. నిత్యావసర వస్తువులు కొనేందుకు వెళ్లినప్పుడు జూట్ బ్యాగులను వెంట తీసుకెళ్లాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పరమేష్, పంచాయతీ కార్యదర్శి గంగారం, వార్డు సభ్యులు ఖాజా, నవీన్, ఆనంద్, రాహుల్, రఘు ఉన్నారు.
- Advertisement -



