- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఎడ్లపల్లి గ్రామానికి చెందిన చెన్నెవెని నిరిష ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్ ఆస్పత్రిలో చేసి చికిత్స పొందుతుంది. వైద్య ఖర్చుల కోసం కుటుంబ సభ్యులు రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు విన్నవించగా సీఎం సహాయనిధి నుంచి రూ.60 వేల చెక్కు మంజూరు చేయించారు. మంత్రి అదేశాలతో బాధిత కుటుంబానికి సోమవారం గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -



