- Advertisement -
హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో కావ్యా రెడ్డిని వివాహం చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో వీరి రోకా వేడుక ఇరు కుటుంబాల సమక్షంలో ఘనంగా జరిగింది. కావ్యా రెడ్డి నివాసంలో జరిగిన
ఈ వేడుకలో దర్శకులు బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని, నిర్మాతలు శిరీష్, సాహు గారపాటి, రామ్ ఆచంట, మిర్యాల రవీందర్ రెడ్డి, నాగ వంశీ, కేకే రాధామోహన్, ధీరజ్ మొగిలినేని, హీరోయిన్ సంయుక్త తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి నిశ్చితార్థం, వివాహ తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు.
- Advertisement -



