నవతెలంగాణ సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలోని 65వ నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాందేడ్ – అకోల రహదారిలో మామిడిపల్లి ఎక్స్ రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బైక్ను లారీ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలకు పంచనామా నిర్వహించారు. మృతులు అరబిందో పరిశ్రమలో పని చేస్తున్న కార్మికులుగా గుర్తించారు. మృతులు శ్రీకాకుళం చెందిన వారని పోలీసులు తెలిపారు.