నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూర్ పట్టణ కేంద్రంలో పశువులకు గాలికుంటు టీకాల కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పశువైద్యాధికారి మాట్లాడుతూ పాడి రైతులు తమ పశువులకు తప్పనిసరిగా గాలికుంటు టీకాలు వేయించాలని సూచించారు. ప్రతి గ్రామంలో పశువులకు గాలికుంటు టీకాలు వేయడం జరుగుతుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, సర్పంచ్ బాల్యాల రేఖ సుదర్శన్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు శ్రీరాం వెంకటేష్, పశువైద్యాధికారి దేవేందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుదర్శన్, పట్టణ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, నాయకులు లింబాద్రి, మాజీ ఎంపీపీ గాల్ రెడ్డి, సిద్దగౌడ్ తదితరులు పాల్గొన్నారు.



