- Advertisement -
నవతెలంగాణ -కామారెడ్డి
రామారెడ్డి మండల మాజీ జడ్పీటీసీ నారెడ్డి మోహన్ రెడ్డి ఇటీవల జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కామారెడ్డిలోని ఆయన నివాసం వద్ద ఉంచిన పార్థివ దేహానికి తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనగామ గ్రామ సర్పంచ్ మట్ట శ్రీనివాస్, బిబిపేట మండల మాజీ వైస్ ఎంపీపీ కప్పేరా రవీందర్ రెడ్డి, తుజాల్పూర్ మాజీ సర్పంచ్, వెంకట్ గౌడ్, సుభాష్ రెడ్డి మిత్రబృందం సభ్యులు, స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొని మోహన్ రెడ్డి సేవలను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు.
- Advertisement -



