- Advertisement -
సర్పంచ్ గడ్డం క్రాంతి రణదేవ్
నవతెలంగాణ – మల్హర్ రావు
నర్సరీలో పెంచుతున్న మొక్కలకు రెండుపూటలా నీళ్లు పట్టాలని మండలంలోని చిన్నతూoడ్ల సర్పంచ్ గడ్డం క్రాంతి రణదేవ్ ఈజిఎస్ సిబ్బందికి సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా శనివారం చిన్నతూండ్ల గ్రామపంచాయతీ పరిధిలో వన మహోత్సవo నర్సరీనీ సర్పంచ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రతిరోజు రెండు పూటలా మొక్కలకి నీరు పట్టించి మొక్కలను కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ దేవేందర్,నర్సరీ వాషర్ మహేందర్ రావు,ఉపాధి కూలీలు పాల్గొన్నారు.
- Advertisement -



