- Advertisement -
ఎంఈఓ రాందాస్
నవతెలంగాణ – నెల్లికుదురు
పదవ తరగతి పరీక్షలు తెలుగు సబ్జెక్టుతో ప్రారంభమై ప్రశాంతంగా నిర్వహించామని ఎంఈఓ రాందాస్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల మరియు గౌట్ హైస్కూల్ రెండు సెంటర్లలో పరీక్షలు ప్రారంభమయ్యాయని చెప్పారు. వీటిలో ఆదర్శ పాఠశాలలో మొత్తం విద్యార్థులు 177 మంది కి 176 మంది హాజరయ్యారని అన్నారు. గౌట్ హైస్కూల్లో 180 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 178 మంది విద్యార్థులు హాజరు అయ్యారని తెలిపారు.
- Advertisement -


