- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లారా గ్రామంలో కొనసాగుతున్న అఖండ శివనామ సప్త ఏడవ ఆదివారంతో ముగిసింది. కథ ముగింపు రోజున అన్నదాత జె సిద్ధిరాం దంపతులు, మద్నూర్ సింగిల్విండో మాజీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్ దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఏడురోజుల పాటు రాత్రింబవళ్లు భజన కీర్తనలు కొనసాగుతున్నాయి. శివనామ సప్త విజయవంతానికి బసవరాజ్ పటేల్ ఆధ్వర్యంలో కమిటీ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లలో పాల్గొంటున్నారు.
- Advertisement -



