నవతెలంగాణ- నసురుల్లాబాద్
ఉప సర్పంచ్ ల ఫోరమ్ మండల అధ్యక్షుడుగా కర్ణం భాస్కర్ మైలారం ను ను ఏకగ్రీవంగా మండల పరిధి ఉప సర్పంచ్లు తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో ఉప సర్పంచ్ల ఫోరమ్ కార్యవర్గం సమావేశం నిర్వహించారు. ఫోరమ్ కార్యదర్శిగా సరస్వతి శివ దయాల్ సంగెం (ఏ), ఉపాధక్షులు గా సవిత (నాచుపల్లి),గారిని ఏకగ్రీవం గా ఎన్నుకోవడం జరిగిందన్నారు.
అదేవిధంగా ఆయనకు నియామక పత్నాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కర్ణం భాస్కర్ మాట్లాడుతూ.. తన ఎన్నికకు సహకరించిన మండల పరిధి ఉప సర్పంచులు, సర్పంచులకు నాయకులకు కృతజ్ఞతలు సవేందర్ తెలిపారు. మండలంలోని ఉప సర్పంచ్ లా సమస్యలు పరిస్కారం కొరకు కృషి చేస్తానని, ఉప సర్పంచు లా హక్కులను గుర్తించేలా పోరాడుతనని తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన మండల ఉప సర్పంచ్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.



