నవతెలంగాణ – ఆలేరు టౌన్
ఆలేరు మండల కేంద్రంలో అమెరికా అధ్యక్షుడు ట్రంపుకు వ్యతిరేకంగా సోమవారం బస్టాండ్ చౌరస్తా వద్ద సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేష్ మాట్లాడుతూ.. ప్రపంచంలో అమెరికా అనేది పెద్దన్న పాత్ర పోషించి ప్రపంచం మీద దాడులు చేస్తూ సామ్రాజ్యవాదాన్ని విస్తరించడానికి ఇరాన్ పైన దౌర్జన్యంగా అనుబాంబుల పేరుతో దాడులను ఖండిస్తున్నామన్నారు.
భారత ప్రభుత్వం తరపున ప్రధాని నరేంద్ర మోడీ మౌనం పాటించడం సరికాదని ట్రంపు విధానాలను ఖండించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి చౌడబోయిన కనకయ్య, మండల నాయకులు కందుల మధు, గిరిపోయిన స్వామి, పొన్నబోయిన రవి పోతు ప్రవీణ్, తెడ్డు ఆంజనేయులు, యాట ఉపేందర్ ,గ్యారబుక్షపతి, పార్వతి ,సంపతి ,సుశీల తదితరులు పాల్గొన్నారు.



