- Advertisement -
నవతెలంగాణ- హైదరాబాద్: పెద్దపల్లి జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంచిర్యాలకు చెందిన లయన్స్ క్లబ్, క్రెడాయ్ సభ్యుడు ఎడ్ల శ్రీనివాస్, రజిత దంపతులు తమ కుమార్తె రిషితను చూసి హైదరాబాద్ నుండి సోమవారం రాత్రి మంచిర్యాలకు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ సమీపంలో కారు అదుపుతప్పి కల్వర్ట్ను ఢీకొనడంతో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు.
- Advertisement -



