- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని రుద్రారం గ్రామంలో రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సహకారంతో ఏఎస్ఈఏపీ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య, సర్పంచ్ చంద్రగిరి సంపత్, ఏపిఎం హనుమంతరావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు మహిళలకు జీవనోపాధిని పెంపొందించడానికి మంథని నియోజక వర్గంలోని ప్రతి గ్రామంలో మంత్రి శ్రీదర్ బాబు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఈ కార్యక్రమంలో సిసి ఇందారపు రవికుమార్, వార్డు సభ్యులు, స్వశక్తి మహిళలు పాల్గొన్నారు.
- Advertisement -



