Tuesday, March 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతు భరోసాకు దరఖాస్తుల స్వీకరణ 

రైతు భరోసాకు దరఖాస్తుల స్వీకరణ 

- Advertisement -

• మండల వ్యవసాయ అధికారి సాహస్ 
నవతెలంగాణ – మర్రిగూడ 
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందజేస్తున్న రైతు భరోసా (వ్యవసాయ పెట్టుబడి సహాయం పథకం – యాసంగి 2025-26) సంబంధించి 28.02.2026 వరకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొందిన రైతులు రైతు భరోసా పెట్టుబడి సాయం పొందుటకు రైతుల నుండి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు మండల వ్యవసాయ అధికారి సాహస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

దరఖాస్తుకు కావలసిన పత్రాలు:

1.పట్టాదారు పాస్ పుస్తకం లేదా డిజిటల్ సంతకం అయిన జిరాక్స్ 2.ఆధార్ కార్డు జిరాక్స్ 3.బ్యాంకు సేవింగ్ ఖాతా జిరాక్స్ 4.పూర్తిగా నింపబడిన దరఖాస్తు ఫారం.పత్రాలను సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి కి చివరి తేదీ ఈ నెల 20 శుక్రవారం లోపు సమర్పించాలని సూచించారు. గతంలో రైతు బంధు పొందిన రైతులు మళ్లీ దరఖాస్తు చేయవలసిన అవసరం లేదని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -