- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : మిడిలీస్ట్ యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా వంటగ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రమైంది. కమర్షియల్ సిలిండర్లు బ్లాక్మార్కెట్లో రూ.4-5 వేలకు అమ్ముడవుతుండటంతో ఏపీలో హోటళ్లు మూతబడే ప్రమాదం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్లో హోటల్ మేనేజ్మెంట్లు సివిల్ సప్లైస్ డైరెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించాయి. ప్రతిరోజూ ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు మాత్రమే హోటళ్లు నడపాలని, అన్ని హోటళ్లు సోమవారం సెలవు ప్రకటించాలని, స్టార్ హోటళ్లలో ఐటమ్స్ను 45 నుంచి 15కి తగ్గించాలని సూచించారు.
- Advertisement -



