- Advertisement -
నవతెలంగాణ మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను బుధవారం హౌసింగ్ ఏఈ హన్మంతు పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు మేరకు ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఇండ్ల పిల్లర్ల స్థలంను కొలతలు వేసి చూశారు. మద్నూర్, డోంగ్లి మండలాల్లోఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల కొలతలలో లబ్ధిదారులు పాల్గొన్నారు.
- Advertisement -



