నవతెలంగాణ ఆర్మూర్: పట్టణంలోని క్రిస్మస్ వేడుకలు సోమవారం సంబురంగా నిర్వహించుకున్నారు. మండలంలోని పిప్రి గ్రామములోని ఎల్- షద్దాయ్ చర్చ్ నందు క్రిస్మస్ పండగ ఘనంగా నిర్వహించారు. దైవ సేవకులు పాస్టర్ జి శేఖర్ ఇడ్విన్ మాట్లాడుతూ – ప్రపంచ మానవాళి కొరకు క్రీస్తు యేసు పుట్టాడని ఇది ప్రపంచానికి గొప్ప పండుగ అని, ప్రజలంతా క్రీస్తు మార్గంలో నడవాలని బోధించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆటపాటల నడుమ క్రిస్మస్ పండుగ ఆనందంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘ పాస్టర్ జి శేఖర్ ఎడ్విన్ సంఘ పెద్దలు, యవనస్తులు పాల్గొన్నారు