- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డికి ప్రమాదం తప్పింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బుధవారం ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ సీఎం రేవంత్ విమానంలో హైదరాబాద్ కు బయలుదేరారు. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన ప్రయాణించిన విమానం 20 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టినట్లు సమాచారం. ఆ సమయంలో విమానంలో రేవంత్ సహా 226 మంది ప్రయాణికులు ఉన్నారు. రాత్రి 8:35 గంటలకు ఫ్లైట్ సురక్షితంగా ల్యాండింగ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
- Advertisement -



