- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : కృష్ణా నది ఎగువ పరివాహ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల నుంచి 79,403 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం గురువారం ఉదయం 6 గంటలకు 824.80 అడుగులు.. నీటి నిల్వ 44.6090 టీఎంసీలుగా నమోదయింది. శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించలేదు.
- Advertisement -



