- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : అనంతపురం జిల్లా, గుత్తి మండలం కొత్తపేట సమీపంలో జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున కారులో మంటలు చెలరేగి అది పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే, కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు సజీవ దహనమైనట్లు సమాచారం. మంటల్లో మూడు పుర్రెలు కనిపించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



