- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : పసిడి ప్రియులకు బంగారం ధరలు మళ్లీ షాక్ ఇచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో గురువారం గోల్డ్ రేట్లు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.820 పెరిగి రూ.1,44,330 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.750 పెరిగి రూ.1,32,300కు చేరింది. అటు కేజీ వెండి ధర రూ.2,35,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలను బట్టి వీటి ధరల్లో స్వల్ప తేడాలు ఉండొచ్చు.
- Advertisement -



