నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం రంజాన్ మాసపు ఉపవాస దీక్షలు, ప్రార్థనలకు చివరి అంకమైన ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సోదరభావం, సమానత్వం, సమైక్యతా స్పూర్తి సమాజంలో మరింత బలపడాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ ని బోకే, శాలువాతో సన్మానించి రంజాన్ శుభాకాంక్షలను లంబాడ హక్కుల పోరాట సమితి నాయకులు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాచారెడ్డి మండల అధ్యక్షులు మాలోత్ నౌసిలాల్ నాయక్, లంబాడ హక్కుల పోరాట సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నునావత్ గణేష్ నాయక్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ నాయక్, సర్పంచ్ సదర్ నాయక్, సర్పంచ్ మాన్ సింగ్ నాయక్, గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు వినోద్, లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి రవిందర్ నాయక్, కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ నాయక్, రాకేష్, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.



