- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని గుల్లతాండ మాజీ సర్పంచ్ గోవింద్ రతన్ నాయక్ శనివారం మృతి చెందారని గ్రామ సర్పంచ్ సుమతి యశ్పాల్ రాథోడ్ తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. తాండకు పెద్దదిక్కైన గోవిందా నాయక్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్నారని, ఈ క్రమంలోనే అకాల మరణం పొందారని తెలిపారు. నేడు సాయంత్రం ఐదు గంటలకు అంత్యక్రియలు ఉన్నాయని కుటుంబీకులు తెలిపారు. అదేవిధంగా మాజీ సర్పంచ్ అకాల మృతికి పలువురు ప్రజాప్రతినిధులు సంతాపం తెలియజేశారు.
- Advertisement -



