- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు మద్నూర్ మండల కేంద్రంలో శనివారం రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. మద్నూర్ మండల మైనార్టీ నాయకులు జావిద్ పటేల్ ఇంటికి వెళ్లారు. అక్కడ కలిసినా ముస్లిం సోదరులందరికీ రంజాన్ పండుగ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జావీద్ పటేల్ ఇంట్లో ఎమ్మెల్యే తోటాకు సురుకుంబ స్వీటును జావిద్ పటేల్ త్రాగించారు. ఎమ్మెల్యే వెంట మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, సాయి పటేల్ మద్నూర్ గ్రామ సర్పంచ్, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మైనార్టీ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- Advertisement -



