- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఇప్పలపల్లి గ్రామంలో ఇటీవల సర్పంచ్ అబ్బినేని లింగస్వామి, ఉప సర్పంచ్ అక్కల దేవేందర్ తోపాటు భక్తఅంజనేయ స్వామి నూతన ఆలయ కమిటీ సభ్యులు నిర్మాణం కోసం భూమిపూజ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆలయ నిర్మాణం కోసం తనవంతుగా ఉప సర్పంచ్ అక్కల దేవేందర్ ఆదివారం రూ.21,021 వేలు విరాళంగా ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఇందుకు కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దాతలు ఇంకా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
- Advertisement -



