- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గం (2026-27) ఎన్నిక ఆదివారం శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం యందు నిర్వహించినారు. గత కొన్ని సంవత్సరాల నుండి ఆలయ నిర్మాణంలో నిర్విరామ కృషిచేసిన పెద్ద మనుషులు ఎస్ ప్రణీత్, ఎస్ విశాల్ లను శాలువతో సన్మానించి సత్కరించినారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ అధ్యక్షునిగా ముప్పారం శివకుమార్, కార్యదర్శిగా కత్రాజీ చిన్న గంగాధర్, గ్రామ అభివృద్ధి కమిటీకి శృంగారం మోహన్ లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారులు చిన్నారెడ్డి, జర్నలిస్టు తిరుపతి, సాయిరాం, శ్రీనివాస్, తిరుమలేష్, సాగర్, మనీష్ , రమేష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



