- Advertisement -
నవతెలంగాణ – యాదగిరి గుట్ట
దేశ వ్యాప్తంగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న సీపీఐ(ఎం) ను ప్రజలు ఆదరించాలని ఆ పార్టీ పట్టణ కార్యదర్శి నూకల భాస్కర్ రెడ్డి కోరారు. ఆదివారం ఇంటింటికి సీపీఐ(ఎం) కార్యక్రమంలో బాగంగా యాదగిరిగుట్టలోని ప్రశాంత్ నగర్ లోతిరిగి పార్టీ విలువలను తెలియజేస్తూ సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం అధికారం లో ఉన్న కాంగ్రెస్ ప్రజల కోసం పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) సినియర్ నాయకులు ఈశ్వర్ రెడ్డి, యస్ కె షరిప్ ,సీస శ్రీనివాస్ పాల్గొన్నారు.
- Advertisement -



