- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కామన్ వెల్త్ గేమ్స్లో భారత్ అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. శనివారం ఒక్కరోజే బాక్సింగ్లో ఆరు స్వర్ణ పతకాలు సాధించింది. ప్రీతి పవార్, జాస్మిన్ లంబోరియా, సాక్షి చౌదరి, ప్రియా గంగాస్, అరుంధతి చౌదరి, సచిన్ సివాచ్లు బంగారు పతకాలు నెగ్గారు. పురుషుల 60 కేజీల విభాగంలో సచిన్ సివాచ్ ఆస్ట్రేలియా బాక్సర్ను ఓడించి స్వర్ణం సాధించాడు. ఈ విజయాలతో భారత్ పతకాల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. మొత్తం పతకాల సంఖ్య 36కు చేరుకుంది.
- Advertisement -



