నవతెలంగాణ – వేల్పూర్/ ఆర్మూర్ : మండలంలోని మోతే గ్రామంలో సోమవారం రెండు చలివేంద్రాలను ఎస్సై సంజీవ్ ప్రారంభించారు. హెదరాబాద్ లో నివసిస్తున్న మోతె గ్రామానికి చెందిన మాయజూంస్ ఫిలింస్ యజమాని అల్లపుల్ల గంగారెడ్డి , తన తండ్రి కి.శే. అల్లపుల్ల రాజులు గారి పేరున గ్రామంలో తక్కెల గాంధీ దగ్గర , కిందివాడ చింతచెట్ల బస్టాప్ కాడ ఇట్టి చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల దాహార్తిని తీర్చే ఈ చలివెంద్రాల ఏర్పాటు ను ప్రశంసించారు . బయట ప్రాంతాల్లో స్థిరపడ్డ వ్యక్తులు తమ సొంత ఊరికి తోచిన సేవ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దొల్ల రమేశ్ రెడ్డి, దాత మాయజూంస్ ఫిలింస్ యజమాని అల్లపుల్ల గంగరెడ్డితో పాటు ఉప సర్పంచ్ పరంజ్యోతి, మజీ సొసైటీ చైర్మెన్ రాజెశ్వర్, పాలెపు బాల్ రాజ్, వార్డు మెంబర్స్, పలు పార్టీల నాయకులు, భవాని యూత్ సభ్యులు పాల్గొన్నారు.
మోతే గ్రామంలో రెండు చలివెద్రాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



