నవతెలంగాణ హైదరాబాద్: హైబ్ ఇండియా ఆడిషన్ ప్రారంభాన్ని ప్రకటించింది. గ్లోబల్ స్థాయిలో కళాకారులను గుర్తించే తన కార్యక్రమాలను విస్తరించే లక్ష్యంతో, హైబ్ భారతదేశంలోని ప్రతిభా వేదికలో అధికారికంగా ప్రవేశించింది. హైబ్ ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా నిరూపితమైన మల్టీ-హోమ్, మల్టీ-జానర్ వ్యూహంలో భాగంగా, హైబ్ ఇండియా భారతదేశానికి అనుగుణంగా కళాకారుల అభివృద్ధి విధానాన్ని స్థానికీకరించనుంది. అంతర్జాతీయ స్థాయిలో విజయవంతమైన కళాకారులను గుర్తించి, శిక్షణ ఇచ్చి, అభివృద్ధి చేయడంలో ప్రసిద్ధిచెందిన ఈ విధానాన్ని భారత్లో అమలు చేయనుంది. 21వ శతాబ్దపు పాప్ ఐకాన్లైన బిటిఎస్ అండ్ గ్లోబల్ గర్ల్ గ్రూప్ కాట్సేయె వంటి సాంస్కృతికంగా ప్రభావం చూపిన కళాకారులను తీర్చిదిద్దిన వారసత్వంతో, ఇప్పుడు ఈ సంస్థ భారతదేశంపై దృష్టి సారించి, తదుపరి తరం గ్లోబల్ స్టార్లను గుర్తించి అభివృద్ధిచేయడానికి సిద్ధమవుతోందన్నారు.
హైబ్ ఇండియా ఆడిషన్ భారతదేశం, భారతీయ వలస సముదాయానికి చెందిన అభిరుచి గల సంగీత ప్రతిభను గుర్తించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఎంపికైన అభ్యర్థులకు హైబ్ సంస్థ ప్రపంచ స్థాయి శిక్షణ, ప్రొడక్షన్ వ్యవస్థలో ప్రవేశించే అరుదైన అవకాశాన్ని అందిస్తుంది. సృజనాత్మక అభివృద్ధి, ప్రదర్శన శిక్షణ, గ్లోబల్ కథనాన్ని సమన్వయం చేస్తూ, ఈ కార్యక్రమం ప్రపంచ వేదికపై భారతదేశాన్ని ప్రతినిధ్యం వహించగల కళాకారులను తీర్చిదిద్దేలా రూపొందించబడింది.



