- Advertisement -
– మాధవి లత
నవతెలంగాణ-భువనగిరి : బాలికలకు మంచి వసతులతో ఆశ్రమం నిర్వహణ చేయాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి వి. మాధవి లత కోరారు. బుధవారం భువనగిరిలో ని బాలసదన్న సందర్శించి బాలికలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. బాల సతన్ వసతులను పరిశీలించారు. బాలికల ఆరోగ్యం పై తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు వారి అభివృద్ధికి బట్టి పాటలు చిత్రలేఖరం వ్యాసరచన ప్రసంగం అంశాలలో జీవిత నైపుణ్యాలలో మంచి శిక్షణ ఇవ్వాలన్నారు. శాఖపరంగా పరిమితులను అనుసరించి తీసుకోవాలని బాలసదన్ సిబ్బందికి తగు సూచనలు చేసారు.
- Advertisement -



