- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఆన్లైన్ మోసాలు, ఫేక్ అకౌంట్లు, వేధింపులను అరికట్టేందుకు ఇన్స్టాగ్రామ్ సహా అన్ని సోషల్ మీడియా ఖాతాలకు కేవైసీ తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. పార్లమెంటరీ కమిటీ సిఫార్సుల మేరకు, సోషల్ మీడియా, గేమింగ్, డేటింగ్ యాప్స్లో కేవైసీతో పాటు తరచూ వెరిఫికేషన్, ఏజ్ వెరిఫికేషన్ తప్పనిసరి చేయాలని ప్రతిపాదనలు వచ్చాయి. ఇటీవల పెరుగుతున్న సైబర్ నేరాలు, డీప్ ఫేక్ వీడియోల నేపథ్యంలో ఈ ప్రతిపాదనలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
- Advertisement -



