- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి బేగంపేట విమానాశ్రయం నుంచి కుటుంబ సమేతంగా భద్రాచలం బయలుదేరారు. ఆలయానికి చేరుకుని శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకోనున్నారు. అనంతరం రూ. 351 కోట్లతో ఆలయ విస్తరణ తొలి దశ అభివృద్ధి పనులకు భూమి పూజ, శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత మిథిలా స్టేడియంలో స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవంలో పాల్గొంటారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు.
- Advertisement -



