- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూర్ పట్టణానికి చెందిన 16 వ వార్డ్ మెంబర్ రాజు ఒక రిపోర్టర్ తన పై నిరాదరణ వార్తలు, వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వార్తలు రాస్తూ సామాజికంగా తక్కువ చేసే వార్తలు రాస్తున్నాడని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సదరు రిపోర్టర్ పై విచారణ జరిపి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిబంధన ప్రకారం చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో పేర్కొన్నట్లు తెలిపారు.
- Advertisement -



