Thursday, April 2, 2026
E-PAPER
Homeఆటలుభారత్‌కు 136వ ర్యాంక్‌

భారత్‌కు 136వ ర్యాంక్‌

- Advertisement -

ఫిఫా ర్యాంకింగ్స్‌ విడుదల
రోమ్‌:
అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సమాఖ్య(ఫిఫా) తాజా ర్యాంకింగ్స్‌లో భారత్‌ సత్తా చాటింది. ఫిఫా బుధవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో భారత్‌ 136వ ర్యాంక్‌లో నిలిచింది. ఈ ర్యాంకింగ్‌ ప్రకటించడానికి ముందు భారత్‌ 141వ స్థానంలో నిలువగా.. తాజా ర్యాంకింగ్స్‌లో భారత్‌ ఐదు ర్యాంక్‌లను ఎగబాకింది. హాంకాంగ్‌(చైనా)తో జరిగిన ఎఎఫ్‌సి ఆసియాకప్‌ క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో భారత్‌ 2-1గోల్స్‌ తేడాతో గెలుపొందడంతో భారత జట్టు ర్యాంక్‌ మెరుగుపడింది. దీంతో మయన్మార్‌, లావోస్‌ల తర్వాత ఆసియా నుంచి మూడో అత్యధిక ర్యాంక్‌కు చేరిన దేశంగా భారత్‌ నిలిచింది. మంగళవారం ఎఎఫ్‌సి ఆసియాకప్‌ క్వాలిఫయర్స్‌లో భారత్‌ తరఫున రయాన్‌ విలియమ్స్‌ తొలి అర్ధభాగంలో గోల్‌ చేయగా.. రెండో అర్ధభాగంలో ఆకాశ్‌ మిశ్రా మరో గోల్‌ కొట్టాడు. దీంతో క్వాలిఫయర్స్‌లో భారత్‌ సాధించిన ఏకైక విజయం ఇదే. అలాగే హెడ్‌ కోచ్‌ ఖలీద్‌ జమీల్‌కు స్వదేశంలోనూ ఇదే తొలి గెలుపు. హాంకాంగ్‌పై భారతజట్టు గెలిచినా.. 2027 ఎఎఫ్‌సి ఆసియాకప్‌కు భారత్‌ అర్హత సాధించడంలో విఫలమైంది. 11ఏళ్లలో భారతజట్టు ఈ టోర్నీకి అర్హత సాధించకపోవడం ఇదే తొలిసారి. ఈ గ్రూప్‌లో భారత్‌ ఆడిన 6మ్యాచుల్లో 5పాయింట్లతో నిలిచింది. ఇదే గ్రూప్‌లో సింగపూర్‌(14), హాంకాంగ్‌(8) తొలి రెండు స్థానాల్లో నిలిచి నాకౌట్‌కు చేరాయి. భారత ఫిపా అత్యధిక ర్యాంక్‌ 2015లో 173వ స్థానంలో నిలువడం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -