- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యాలయం ఎంబీ భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు టి. జ్యోతి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, టి. సాగర్, రాష్ట్ర నాయకులు జి. నాగయ్యతో పాటు ప్రజా సంఘాల నాయకులు, రాష్ట్ర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు దేశ స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు. ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సమానత్వం కోసం పోరాటాలను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.


- Advertisement -



