- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో నమోదైన ఈ ప్రకంపనలు బుధవారం అర్థరాత్రి చోటుచేసుకున్నాయి. తూర్పు మొలుక్కా సముద్ర తీరానికి సమీపంలో, భూమి నుంచి సుమారు 35 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేసియా దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఘటనలో కొన్ని భవనాలు దెబ్బతిన్నాయి. ప్రాణనష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



