- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ కొనసాగుతోంది. బకాయిలు పూర్తిగా చెల్లించే వరకు సేవలను నిలిపివేస్తామని ఆస్పత్రులు స్పష్టం చేశాయి. ప్రభుత్వం రూ.1,000 కోట్లు విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ, స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. మొత్తం రూ.3,000 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బంద్ను కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయంతో రోగులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
- Advertisement -



