నవతెలంగాణ – సదాశివ నగర్: శ్రీ సాయి విజ్ఞాన్ హై స్కూల్ పద్మాజివాడి గ్రామం లో సమాచార హక్కు చట్టం 2005 పైన అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర డైరెక్టర్ సలీం. అవగాహన కల్పించారు. గురువారం సదాశినగర్ మండలంలోని పద్మాజివాడి గ్రామంలో గల శ్రీ సాయి విజ్ఞాన్ హై స్కూల్ లో సమాచార హక్కు చట్టం 2005 ఇతర చట్టాల పైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది ఇట్టి కార్యక్రమానికి పాఠశాల కరస్పాండెంట్ శ్రీ రవీందర్ రెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి శ్రీ ఎం ఏ సలీం పాల్గొని ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్ సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ కామారెడ్డి జిల్లా సలహాదారులు U.భాగ్యలక్ష్మి పాఠశాల అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
సమాచార హక్కు చట్టం 2005 పై అవగాహన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



