- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండలంలోని సీఎస్ఐ, బాప్టిస్ట్ చర్చిలలో గుడ్ ఫ్రైడే వేడుకలను క్రైస్తవులు ఘనంగా నిర్వహించుకున్నారు. లోకానికి శాంతి సందేశాన్ని అందించిన క్రీస్తు త్యాగాన్ని పాస్టర్లు స్మరించారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం భక్తులు సిలువ యాత్ర చేపట్టారు. శనివారం మండలంలోని వివిధ గ్రామాల్లోని చర్చల వద్ద ‘రన్ ఫర్ జీసస్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మండలంలోని సేవాదాస్ నగర్ లో ఉన్న ఓలి నిస్సి చర్చిలో పాస్టర్ పురుషోత్తం ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
- Advertisement -



